- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : బహు భార్యత్వం ఉన్న ఓ వ్యక్తిని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. పది మంది మహిళలను వివాహమాడిన అతడి గొంతును గుర్తు తెలియని వ్యక్తులు తెగ కోశారు. ఈ హత్యపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని భోజ్పురకు చెందిన జగన్లాల్ (52) పది మంది మహిళలను వివాహం చేసుకున్నాడు. మొదటి వివాహం తర్వాత సంతానం కలగకపోవడంతో బాలుడిని దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన వరుస వివాహాల్లో ఐదుగురు భార్యలు మరణించారు. మరో ముగ్గురు భార్యలు వదిలేసి వెళ్లారు. ప్రస్తుతం దత్త పుత్రుడుతోపాటు ఇద్దరు భార్యలు ఆయనతో ఉంటున్నాడు.
జగన్లాల్కు తాతల నుంచి సంక్రమించిన ఆస్తితో కోటీశ్వరుడు అయ్యాడు. ఆ ఆస్తిని తన దత్తపుత్రుడికి బదలాయించాలని ఇటీవలే నిర్ణయించుకోని ఆ పనులు చేపడుతున్నాడు. ఇంతలోనే అతడు హత్యకు గురవ్వడం కలకలం రేపింది. అయితే ఆ ఆస్తిపై కొందరి కన్ను పడిందని స్థానికులు పేర్కొంటున్నారు. హత్య ఎవరు చేసుంటారనే విషయమై విచారణ కొనసాగుతోందని స్థానిక పోలీసు అధికారి మనోజ్ కుమార్ త్యాగి తెలిపారు.