అన్నం తింటుండగా గొంతు కోసి హత్య 

by  |
అన్నం తింటుండగా గొంతు కోసి హత్య 
X

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం రాజానగరం గ్రామంలో ఆదివారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. మారం సుబ్బారెడ్డి అనే 60 సంవత్సరాల వ్యక్తిని ఇంట్లోనే హత్య చేశారు దుండగులు. స్థానిక కథనం ప్రకారం… సుబ్బారెడ్డి భోజనం చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం అతని గొంతు కోసి హత్య చేసి అక్కడి నుండి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.



Next Story

Most Viewed