దారి కోసం భర్త హత్య.. భార్య పరిస్థితి విషమం

by  |
దారి కోసం భర్త హత్య.. భార్య పరిస్థితి విషమం
X

దిశ, జగిత్యాల : గ్రామాల్లో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూ తగాదాల వలన కొందరి ప్రాణాలు పోతున్నాయి. చిన్న చిన్న గొడవలకే ప్రాణాలు తీసుకునే దాకా వెళ్తున్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా భూ సమస్యల విషయంలో సహనం కోల్పోయిన వాళ్లు తమ ప్రత్యర్థులను అత్యంత దారుణంగా హత్య చేస్తున్నారు, చేయిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే జగిత్యాల జిల్లాలో ఆదివారం వెలుగు చూసింది.

జిల్లాలోని గ్రామీణ మండలం సంగంపల్లిలో భూ తగాదాల కారణంగా జాలపల్లి రవి, అతని భార్య మల్లవ్వలపై అదే గ్రామానికి చెందిన పత్తిపాక బాపన్న కర్రతో దాడి చేసాడు. ఈ దాడిలో రవి అక్కడికక్కడే మృతి చెందగా, అతని భార్య మల్లవ్వకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమెను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే, గత కొన్ని రోజులుగా ఇంటి దారి విషయంలో ఇరువురి మధ్య గొడవలు తలెత్తాయి. ఆదివారం ఉదయం నుండి ఇంటి దారి విషయంలో ఇరు కుటుంబాలు గొడవకు దిగగా బాపన్న కర్రతో రవి తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో రవి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం హంతకుడు పరారీలో ఉండగా, గాలింపు చర్యలు చేపట్టామని ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు.



Next Story

Most Viewed