ప్రముఖ వ్యక్తిపై కేసు నమోదు : పోలీసులు

by  |
ప్రముఖ వ్యక్తిపై కేసు నమోదు : పోలీసులు
X

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ సీనియర్‌ నేత, మచిలీపట్నం మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావుది రాజకీయ హత్యేనని పోలీసులు నిర్ధారించారు. రాజకీయంగా, సామాజికంగా మోకా ఎదుగుదలను చూసి ఓర్వలేని టీడీపీ నేతలే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసుల ఈ ఘటనలో ప్రధాన నిందితుడు చింతా చిన్నీ, అతని పెదనాన్న కొడుకు చింతా నాంచారయ్య అలియాస్ పులి, అతని అన్న కుమారుడు చింతా కిషోర్‌లతో పాటు కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

Next Story

Most Viewed