హిజ్రాపై హత్యాయత్నం..!

by  |
హిజ్రాపై హత్యాయత్నం..!
X

దిశ, వెబ్‎డెస్క్: ఓ హిజ్రాపై పెట్రోల్ పోసి నిప్పంటించింది మరో హిజ్రా వర్గం. ఈ ఘటన హైదరాబాద్‎లోని మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఎర్రగడ్డలోని అవంతి నగర్‎కు చెందిన హరిప్రసాద్ అలియాస్ హంసకు చందానగర్‎లో నివాసం ఉంటున్న కొంతమంది హిజ్రాలతో విబేధాలు ఉన్నాయి. ఆదివారం రాత్రి హైటెక్ రైల్వేస్టేషన్ సమీపంలో మాట్లాడుకుందాం అంటూ చెప్పడంతో హంస అక్కడికి చేరుకుంది. ఈ క్రమంలో హంసపై పెట్రోల్ పోసి నిప్పంటించి హిజ్రాలు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డ హిజ్రా హంసను మెరుగైన వైద్యం నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హిజ్రా హంస ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed