మాస్క్ నిబంధనలు కఠినతరం

by  |
మాస్క్ నిబంధనలు కఠినతరం
X

దిశ, కరీంనగర్: కరోనా కట్టడిలో భాగంగా మాస్క్‌ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య నిబంధనలు కఠినతరం చేశారు. పట్టణంలోని వ్యాపార సంస్థలతో పాటు సామాన్యులు కూడా మాస్కు లేకుండా కనిపిస్తే ఫైన్లు వేస్తున్నారు. ఓ వైన్ షాపులో మాస్కు లేకుండా మద్యం విక్రయాలు జరుపుతుండగా గమనించిన సమ్మయ్య రూ.5వేలు జరిమానా విధించారు. అంతేకాకుండా రోడ్లపై తిరుగుతున్న సాధారణ పౌరులపైనా ఫైన్లు వేశారు. కేవలం మాస్కులే కాకుండా భౌతిక‌దూరం పాటించని వారిపట్ల సైతం కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

Tags: Municipal Commissioner, tightened, regulations, Mask, fine, karimnagar

Next Story

Most Viewed