కరోనాతో మున్సిపాలిటీ ఉద్యోగి మృతి

by  |
కరోనాతో మున్సిపాలిటీ ఉద్యోగి మృతి
X

దిశ, కోదాడ: కోదాడ పురపాలక సంఘంలో రెవిన్యూ విభాగంలో క్యాషియర్ గా పనిచేస్తున్న అరవింద్ కరోనాతో సూర్యాపేట ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఆయన మృతి చాలా బాధాకరమని మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష, లక్మి నారాయణ దిగ్భాంతి వ్యక్తం చేశఆరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొద్దికాలం క్రితమే పదోన్నతి పొంది సూర్యాపేట నుంచి కోదాడకు వచ్చారని, అరవింద్ మరణం వారి కుటుంబ సభ్యులకు తీరని లోటు అని తెలిపారు. వారి కుంటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు.


Next Story