టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై

by  |
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్2020 లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు షార్జా వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకూ హైదరాబాద్, ముంబై జట్లు నాలుగేసి మ్యాచ్‌లు ఆడి చెరో రెండు మ్యాచ్‌లు గెలిచాయి. ఇరు జట్లు తమ తమ గత మ్యాచ్‌ల్లో భాగంగా హైదరాబాద్.. చెన్నైపై 7 పరుగుల తేడాతో విజయం సాధించగా, పంజాబ్‌పై 48 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఎవరు నెగ్గుతారో వేచి చూడాలి.

Next Story

Most Viewed