ముంబై ఇండియన్స్‌లో కలకలం.. ఒకరికి కరోనా పాజిటివ్

by  |
ముంబై ఇండియన్స్‌లో కలకలం.. ఒకరికి కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: మరో రెండు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న క్రమంలో ప్రాంచైజీలను కరోనా భయపెడుతోంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లతో పాటు ప్రాంచైజీల సిబ్బంది కరోనా బారిన పడగా.. తాజాగా ముంబై ఇండియన్స్‌లో కరోనా కలకలం రేపుతోంది.

టీమిండియా మాజీ వికెట్ కీపర్, ముంబై ఇండియన్స్ కీపింగ్ కన్సల్టెంట్ కిరణ్ మోరే తాజాగా కరోనా బారిన పడినట్లు ముంబై ఇండియన్స్ ప్రకటించింది. ‘ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు. బీసీసీఐ హెల్త్ గైడ్‌లైన్స్‌ను ఆయన పాటిస్తున్నారు. బీసీసీఐ ప్రొటోకాల్స్ ప్రకారం ముంబై ఇండియన్స్ మెడికల్ టీమ్ ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది’ అని ముంబై ఇండియన్స్ ట్వి్ట్టర్‌లో పేర్కొంది.



Next Story

Most Viewed