బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

by  |
బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా మరికాసేపట్లోనే ఐపీఎల్ 48వ మ్యాచ్ ప్రారంభం కానుంది. ముంబై ఇండియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడిన ముంబై 7 మ్యాచుల్లో విజయం సాధించి 4 మ్యాచుల్లో ఓటమి పాలైంది. ఇక బెంగళూరు కూడా ఏమాత్రం తీసిపోకుండా 11 మ్యాచుల్లో 7 విజయాలు, 4 పరాజయాలు నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో రెండు టీమ్‌లల్లో ఏ జట్టు గెలిచినా.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండనుంది.



Next Story