సర్పంచ్‌కు రూ.50వేల జరిమానా విధించిన హైకోర్టు

by  |
సర్పంచ్‌కు రూ.50వేల జరిమానా విధించిన హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ములుగు జిల్లా లక్ష్మీదేవిపేట సర్పంచ్ కుమారస్వామికి హైకోర్టు రూ.50వేల జరిమానా విధించింది. గ్రామస్తులపై ఎస్సై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని.. కేసు వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలన్న సర్పంచ్‌ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. సర్పంచ్‌పై కేసు నమోదైన విషయం దాచిపెట్టినందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పిల్ వేశారని సోమవారం విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. పిల్‌ను దుర్వినియోగం చేస్తే ఉపేక్షించేది లేదని సీజే హెచ్చరించారు.


Next Story

Most Viewed