- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో కీలక మలుపు
<p>దిశ,వెబ్ డెస్క్ : అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. రిలియన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు ఉంచిన వాహనం యజమాని మన్ సుఖ్ హిరేన్ అనుమానస్పద స్థితిలో మరణించడంతో ఈ కేసు తీవ్రత పెరిగింది. దీంతో ఉద్దవ్ ప్రభుత్వం కేసును ఎన్ఐఏకు అప్పగించింది. హిరెన్ మృతి వెనుక సచిన్ వాజే హస్తముందన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ఉద్దవ్ ప్రభుత్వం ఆయనపై వేటువేసింది. అయితే ఈ నేపథ్యంలో […]</p>

X
దిశ,వెబ్ డెస్క్ : అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. రిలియన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు ఉంచిన వాహనం యజమాని మన్ సుఖ్ హిరేన్ అనుమానస్పద స్థితిలో మరణించడంతో ఈ కేసు తీవ్రత పెరిగింది. దీంతో ఉద్దవ్ ప్రభుత్వం కేసును ఎన్ఐఏకు అప్పగించింది. హిరెన్ మృతి వెనుక సచిన్ వాజే హస్తముందన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ఉద్దవ్ ప్రభుత్వం ఆయనపై వేటువేసింది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసులో ముంబై అసిస్టెంట్ పోలీసు ఇన్ స్ట్పెక్టర్ సచిన్ వాజే ప్రమేయం ఉన్నట్టు ఎన్ఐఎ గుర్తించింది. దీంతో అతనిని అదుపులోకి తీసుకుని 12 గంటలపాటు విచారించింది.అనంతరం అతన్ని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు ఎన్ఐఏ తెలిపింది.
Next Story






