త్వరలో 5జీ సేవలు అందిస్తాం : ముఖేశ్ అంబానీ

by  |
త్వరలో 5జీ సేవలు అందిస్తాం : ముఖేశ్ అంబానీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో త్వరలోనే 5జీ టెక్నాలజీని దేశీయంగా పూర్తి స్థాయిలో అభివృద్ది చేశామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తెలిపారు. బుధశారం ముంబైలో జరిగిన రిలయన్స్ 43వ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ 5జీ స్పెక్ట్రమ్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ట్రయల్స్‌ను ప్రారంభిస్తామన్నారు. ఇక మీదట 4జీ గత చరిత్ర కాబోతున్నారు. వచ్చే ఏడాది క్షేత్ర స్థాయిలోకి 5జీని తీసుకొస్తామని వివరించారు.జియోలోకి 5జీ సేవలను తీసుకువస్తుండటం ఆసక్తిగా ఉందన్నారు.

20 మంది స్టార్టప్ పార్ట్‌నర్లతో కలిసి 4జీ, 5జీ, క్లౌడ్ కంప్యూటింగ్, డివైజెస్, ఆపరేటింగ్ సిస్టమ్, బిగ్ డేటా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఏఆర్/వీఆర్, బ్లాక్ చైన్, నేచురల్ లాంగ్వేజ్ అండర్ స్టాండింగ్, కంప్యూటర్ విజన్ వంటి టెక్నాలజీలను జియో ప్లాట్ ఫామ్స్ అభివృద్ది చేసిందని తెలిపారు.

వరల్డ్ క్లాస్ టెక్నాలజీలకు దీటుగా జియో ప్లాట్ ఫామ్స్ ప్రపంచ స్థాయి సాంకేతికతను అభివృద్ధి చేసిందని ముఖేశ్ వెల్లడించారు. ఈ టెక్నాలజీల సాయంతో మీడియా, ఫైనాన్సియల్ సర్వీసెస్, కామర్స్, విద్య, హెల్త్ కేర్, వ్యవసాయం, స్మార్ట్ సిటీస్, స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్, స్మార్ట్ మొబిలిటీ వంటి వైవిధ్యభరితమైన రంగాలకు ఉపయోగపడే సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తమ టెక్నాలజీని ప్రస్తుతానికి మన దేశానికే వినియోగిస్తామని.. ఆ తర్వాత ఇతర దేశాలకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.

రానున్న మూడేళ్ల కాలంలో 50 కోట్ల మొబైల్ వినియోగదారులకు జియో కనెక్ట్ అవుతుందని అంబానీ ధీమా వ్యక్తం చేశారు. 100 కోట్ల స్మార్ట్ సెన్సార్లు, 5 కోట్ల హోమ్, బిజినెస్ వ్యవస్థల (ఎస్టాబ్లిష్ మెంట్లు)కు అనుసంధానమవుతుందని చెప్పారు. మొబైల్ బ్రాడ్ బ్యాండ్, జియో ఫైబర్, జియో ఎంటర్ ప్రైస్ బ్రాడ్ బ్యాండ్, బ్రాడ్ బ్యాండ్ ఫర్ ఎస్ఎంఈ, జియో నేరో బ్యాండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే ఐదు డిజిటల్ కనెక్టివిటీలను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో జియో అద్భుతాలను సృష్టించబోతోందని అంబానీ ఆశాభావం వ్యక్తంచేశారు.


Next Story

Most Viewed