- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: మహేంద్ర సింగ్ ధోని.. క్రికెట్ అభిమానులకు ఈ పేరు వింటే గూస్ బమ్స్ వస్తాయి. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోని ఐపీఎల్లో మాత్రమే కనిపిస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ కరోనా కారణంగా వాయిదా పడడంతో ధోని క్రికెట్కు తాత్కాలికంగా దూరం అయ్యాడు. ఇదే సమయంలో ఫ్యామిలీతో సిమ్లా టూర్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తన కూతురు జీవాతో ధోని సోషల్ మీడియాలో ఓ ఫోటో అప్లోడ్ చేశాడు. సిమ్లాలోని హిల్స్టేషన్లో మీసం తిప్పిన ధోని, తోడుగా కూతరు జీవా ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. తమిళ సూపర్స్టార్ అజిత్.. కూతురు సెంటిమెంట్ నేపథ్యంలో నటించిన జగమల్ల (విశ్వాసం) సినిమా ఫోటోలను ట్యాగ్ చేస్తూ అభిమానులు ధోనీ-జీవాను అభివర్ణిస్తున్నారు. మరికొంత మంది తెలుగు అభిమానులు అయితే, మీసం తిప్పిన ధోని.. విక్రమార్కుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ధోని మైదానంలో కనిపించకపోయినా.. ఇలా సోషల్ మీడియాలో కొత్త ఫోటోలతో అభిమానులకు దగ్గరవుతూనే ఉన్నాడు.
https://twitter.com/ChennaiIPL/status/1407006577702293506?s=20