రాజగృహంపై దాడి.. రాజ్యాంగంపై జరిగినట్టే

by  |
రాజగృహంపై దాడి.. రాజ్యాంగంపై జరిగినట్టే
X

దిశ, ఆర్మూర్: భారతరత్న డాక్టర్ అంబేద్కర్ నివాసమైన రాజగృహంపై జరిగిన దాడి రాజ్యంగం పైన జరిగిన దాడేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మైలారం బాలు అధ్వర్యంలో నల్లజెండాలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఒకే దేశం, ఒకే ప్రజలు, ఒకే చట్టం అని రాజ్యాంగ రచన చేసిన అంబేద్కర్ ఆలోచన విధానంపై పాసీస్టుల పాలనలో దాడులు పెరిగాయన్నారు. అంబేద్కర్ ఇచ్చిన హక్కులతో పదవులను అనుభవిస్తున్న నేతలు ఇప్పుడైనా సిగ్గుపడాలన్నారు. రాజగృహంపై దాడి చేసిన నిందుతులపై రాజద్రోహం కేసు నమోదు చేయాలన్నారు.

Next Story

Most Viewed