MPTC రాసలీలలు.. అర్ధరాత్రి గుడిసెలో వివాహితతో రెడ్ హ్యండెడ్‌గా..

by  |
mptc
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట్ మండలం లోని ఒక గ్రామ ఎంపీటీసీ, వివాహిత తో పట్టు బడ్డారు. గ్రామ శివారులో ఒక వ్యవసాయ క్షేత్రంలో గ్రామస్తులు అడవి పందులనుంచి పంటలు కాపాడు కోవడానికి కాపలాగా వెళ్లడంతో ఎంపీటీసీ రాసలీలలు బయటపడ్డాయి. ఒక గుడిసెలో నుంచి గురువారం రాత్రి మాటలు వినపడటంతో ఇద్దరు యువకులు అక్కడికి వెళ్లి ఆరా తీయడంతో ఎంపీటీసీ తన తమ్ముళ్ళకి ఫోన్ చేసి రప్పించి ఎదురు దాడి చేశాడు. యువకులు గ్రామంలో వ్యక్తులకు సమాచారం ఇవ్వడం తో ఎంపీటీసీ మహిళా రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డారు.

గ్రామస్తుల సమక్షంలో నేను తప్పు చేశానని ఎంపీటీసీ ఒప్పుకొన్నాడు. దాంతో వివాహిత భర్త మనస్తాపనికి గురై తానే స్వయంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి అతని భార్య మీద, ఎంపీటీసీ పైన కంప్లేంట్ ఇచ్చారు. పరాయి వ్యక్తి తో వివాహేతర సంబంధం ఉన్న భార్య తనకు అవసరం లేదని ఎంపీటీసీ తోనే కాపురం చేయాలని పోలీస్ స్టేషన్లో వాపోయాడు. కొందరు యువకులు ఎంపీటీసీ, మహిళా ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేసారు. అవి నాగిరెడ్డి పేట్ , ఎల్లారెడ్డి నియోజకవర్గం లో వైరల్ అయ్యాయి. నాగిరెడ్డి పేట్ ఎస్ఐ ఆంజనేయులును వివరణ కోరగా పిర్యాదు వాస్తవమేనని తెలిపారు.


Next Story

Most Viewed