విజయసాయి కారు అద్దాలు ధ్వంసం..

by  |
విజయసాయి కారు అద్దాలు ధ్వంసం..
X

దిశ, వెబ్‌డెస్క్ : రామతీర్థంలోని ఆలయ సందర్శనకు వచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. విగ్రహాల ధ్వంసం అంశంలో అక్కడి పరిస్థితిని సమీక్షించడానికి వచ్చిన విజయసాయి తొలుత కొండపైకి వెళ్లి ధ్వంసమైన విగ్రహాలను చూసి కిందకు వచ్చారు. తిరిగి వెళ్తున్న క్రమంలో అప్పటికే అక్కడకు భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు విజయసాయి కారును అడ్డగించారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఎంపీ కారు అద్దాలను రాయితో ధ్వంసం చేసి పరారయ్యాడు. నిరసనకారులు ఎక్కువగా ఉండటంతో వారిని అడ్డుకోవడం పోలీసులకు కష్టతరంగా మారింది. దీంతో విజయసాయిని పోలీసులు కాలినడకన తీసుకెళ్లి వేరే వాహనంలో పంపించారు.



Next Story