- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కాటారం : మండల కేంద్రమైన కాటారం నుండి గూడూరు గ్రామానికి రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించే రోడ్డు నిర్మాణానికి శుక్రవారం పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోడగుంట వెంకటేష్ శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో మారుమూల ప్రాంతానికి డబుల్ రోడ్డు ద్వారా రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని, అతి తక్కువ సమయంలో ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుతారని ఎంపీ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు , భూపాలపల్లి టీఆర్ఎస్ యువజన నాయకులు జక్కు రాకేష్ , కాటారం సర్పంచ్ తోట రాధమ్మ, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ ఆన్కారి భవాని, ఎంపీటీసీ తోట జనార్ధన్, ఉప సర్పంచ్ నాయన శ్రీనివాస్, అనంతుల రమేష్ బాబు, జక్కు మొగిలి, కొడుదుల రాజబాబు, బంధం రామ్ రెడ్డి, వెంకట్ రాజం, ఎంపీడీవో ఆంజనేయులు, పీఆర్ఏఈ అశోక్ తదితరులు పాల్గొన్నారు.