- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సీఎంలా కాకుండా వీధి రౌడీలా మాట్లాడుతున్నారని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. మంగళవారం ఆయన నిర్మల్ లో విలేకరులతో మాట్లాడారు. హుజురాబాద్ లో ఓడిపోవటంతో ఇక మా ఆటలు సాగవనే ఆలోచన చేస్తున్నారని.. దీంతోనే బండి సంజయ్ మీద ఆరోపణలు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ హుందాతనం కాపాడుకోకుండా.. ఒక ఉద్యమకారుడిగానే మాట్లాడుతున్నారని అన్నారు. మీరొక గొప్ప ఉద్యమ నాయకుడని.. తెలంగాణ తెచ్చినవారని మీరే చెప్పుకుంటున్నారని.. సంతోషమే కానీ.. సీఎం హోదాలో హుందాగా మాట్లాడితే బాగుంటుందని, చిల్లర రౌడీలా మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. ఇప్పటికైనా ఎవరైనా టీఆర్ఎస్ నాయకులు ఫాం హౌజ్ కు వెళ్లి కేసీఆర్ కు చెబితే బాగుంటుందన్నారు.
హుజురాబాద్ ఎన్నికల తర్వాత బీజేపీ పుంజుకుందని.. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందనే సమాచారం కేసీఆర్ కు వెళ్లటంతోనే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. సీఎం హోదాను చులకనలా చేసేలా ఆయన మాటలున్నాయన్నారు. మీరు రాజకీయంగా మోడీని, అమిత్ షాను కలుస్తారని.. వరి ధాన్యం విషయంలో మరోసారి వెళ్లి మాట్లాడితే సరిపోతుందని.. ఇంత రాద్ధాంతం అవసరం లేదన్నారు. హుజురాబాద్ లో ఓడిపోయారనే ఇలా వ్యవహరిస్తున్నారని.. రాజకీయాల్లో హుందాతనం ఉండాలన్నారు. తాను చాలా ముఖ్యమంత్రులను చూశానని.. వారు ఇలా ఏనాడూ మాట్లాడలేదని.. ఇంత వల్గర్ లాంగ్వేజీలో కేసీఆర్ మాట్లాడారన్నారు. ఆయన సీఎం అని మరిచిపోయి.. ఇంకా ఉద్యమంలో ఉన్నాననే భావనలో ఉన్నారన్నారు. బజారు రౌడీలా మాట్లాడితే ప్రజలు వినటానికి సిద్ధంగా లేరన్నారు.