నాంపల్లి కోర్టుకు హాజరైన రేవంత్‌రెడ్డి

by  |
నాంపల్లి కోర్టుకు హాజరైన రేవంత్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: ప్రజా ప్రతినిధుల కేసులపై విచారణ నేపథ్యంలో పలువురు నేతలు సోమవారం నాంపల్లి సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్యే కాశిపేట లింగయ్య, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ కోర్టుకు వచ్చారు. ఓటుకు నోటు కేసుపై ఏసీబీ సోమవారం విచారణ చేపట్టగా ఈ కేసులో ప్రధాన నిందితులు ఎంపీ రేవంత్ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహ ఉన్నారు. అటు అక్రమంగా బెయిల్ పొందారని నమోదైన కేసులో ఏసీబీ కోర్టుకు గాలి జనార్థన్‌రెడ్డి హాజరయ్యారు.

Next Story

Most Viewed