ఆటో బోల్తా.. వెంటనే స్పందించిన ఎంపీ రంజిత్ రెడ్డి

by  |
ఆటో బోల్తా.. వెంటనే స్పందించిన ఎంపీ రంజిత్ రెడ్డి
X

దిశ, చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గేటు వద్ద ఓ ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. అదే సమయంలో అటు వైపుగా చేవెళ్లలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్తున్న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి వెంటనే తన వాహనాన్ని ఆపారు. క్షతగాత్రులను పక్కన తోటి వారి సహాయంతో 108 అంబులెన్స్ పిలిపించి అందులో హాస్పిటల్‌కు పంపించారు. వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను, ఫోన్ చేసి వైద్యులను ఆదేశించారు.



Next Story

Most Viewed