వాళ్లకు అధికారులు అందుబాటులో ఉండాలి : ఎంపీ రంజిత్ రెడ్డి

by  |
MP Ranjith Reddy
X

దిశ, వికారాబాద్: ప్రజలకు అధికారులందరూ అందుబాటులో ఉండాలని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని డీపీఆర్‌సీ భవనం మద్గుల్ చిట్టెంపల్లిలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్ష కమిటీ సమావేశంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాలపై రివ్యూ నిర్వహించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపైన ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వందశాతం వాక్సినేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక డ్రైవ్‌లో ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొనాలన్నారు.


Next Story

Most Viewed