నా ఫోన్లు ట్యాప్ చేశారు: రఘురామకృష్ణం‌రాజు

by  |
నా ఫోన్లు ట్యాప్ చేశారు: రఘురామకృష్ణం‌రాజు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన ఆరోపణ చేశారు. ఏపీ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలు తన ఫోన్‌ను ట్యాప్ చేశాయని ఆరోపించారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా‌కు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం తన వ్యక్తిగత స్వేచ్ఛ‌కు భంగం కల్గిస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఇది ఆర్టికల్ 14, 19, 21ను ఉల్లంఘించడమేనన్నారు.

తాను వాడుతున్న రెండు ఫోన్లలో మాట్లాడేటప్పుడు ఏవో శబ్ధాలు వస్తున్నాయని అన్నారు. అంతేకాకుండా తనకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. కాగా, ఇటీవల తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని రఘురామకృష్ణంరాజు కేంద్రాన్ని కోరారు. దీంతో ఆయనకు కేంద్రం భద్రతను పెంచిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed