బుద్ధి ఉన్నోడు ఎవడైనా అడుగుతాడా !

by  |
బుద్ధి ఉన్నోడు ఎవడైనా అడుగుతాడా !
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వ తీరుపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు విరుచుకుపడ్డారు. కర్నూలులో ఒక రాజధాని, విశాఖలో ఒక రాజధాని కావాలని బుద్ధి ఉన్నోడు ఎవడైనా అడుగుతాడా ? అని మండిపడ్డారు. అసలు తింటున్నారా గడ్డి తింటున్నారా అని ధ్వజమెత్తారు. అమరావతిలో రైతులు చేస్తున్న ఉద్యమానికి వ్యతిరేకంగా కొందరు మూడు రాజధానులు కోరుతూ ఆటోల్లో వచ్చారని… అక్కడికి చేరుకున్న కొంతమంది ఫోటోను ఆయన చూపించారు. ఇది పెయిడ్ ఆర్టిస్టుల పని అని అర్థమవుతోందన్నారు. చిన్నపిల్లల్లా తెలివి తక్కువ తనంతో ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.



Next Story

Most Viewed