పనికి మాలిన సలహాదారుల మాటలు వినొద్దు !

by  |
raghurama krishnam raju,
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పనికిమాలిన సలహాదారుల సలహాలు వినకుండా ప్రజల మాట వినాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గక ముందే కేర్ సెంటర్లు మూసేశారని ఆరోపించారు. గోదావరి జిల్లాల్లో కరోనా తీవ్రతపై దృష్టి సారించాలన్నారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ న్యాయం కోసం మరొక రాజ్యాంగ సంస్థను ఆశ్రయించారని.. ప్రభుత్వం ఇకనైనా రాజ్యంగ సంస్థలకు గౌరవం ఇవ్వాలని సూచించారు.



Next Story

Most Viewed