ఏ హోదాలో జన్మదిన వేడుకలు నిర్వహించాలి…

by  |
MP Raghurama Krishnam Raju
X

దిశ,వెబ్ డెస్క్: స్వరూపానందేంద్ర స్వామి జన్మదిన వేడుకలు అధికారికంగా నిర్వహించాలన్న లేఖపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణమ రాజు మండి పడ్డారు. ఏ హోదాలో జన్మదిన వేడుకలు నిర్వహించాలో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. సీఎం కోసం యాగం చేసినంత మాత్రానా ఇతర దేవాలయాల్లో స్వరూపనందేంద్ర జన్మదిన వేడుకలను జరుపుకోవాలనుకోవడం హిందూ మతాన్ని కించపరచడమేనని తెలిపారు. ఎవరో రాసిన లేఖకు ప్రభుత్వ అధికారి స్పందించి దేవాలయాలకు ఫార్వర్డ్ చేయడం శిక్షించాల్సిన అంశమని అన్నారు. ఈ లేఖ రాసిన అధికారిపై సీఎం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Next Story