జగన్ క్షమాపణ కోరితే.. శిక్ష తప్పొచ్చు

by  |
జగన్ క్షమాపణ కోరితే.. శిక్ష తప్పొచ్చు
X

దిశ, వెబ్‌డెస్క్: నర్సాపూర్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… మాజీ సీఎంలు నీలం సంజీవరెడ్డి, ఎన్.జనార్థన్‌రెడ్డిలా జగన్‌ కూడా సీఎం పదవికి రాజీనామా చేయాల్సి రావొచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేపోమాపో కోర్టు ధిక్కరణ నోటీసులు తీసుకోవడానికి జగన్‌ సిద్ధంగా ఉండాలన్నారు. కోర్టు నోటీసులపై తమ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోందని, తప్పు ఒప్పుకుని కోర్టులను క్షమాపణ కోరితే జగన్‌కు శిక్ష తప్పొచ్చన్నారు. అయితే ఎవరైనా కింది కోర్టు ఇచ్చిన తీర్పులపై పైకోర్టుకు వెళ్లడం సహజం. కానీ, వైసీపీ పెద్దలు జడ్జిల చిత్తశుద్ధి మీదే అనుమానాలున్నాయంటూ పెద్ద వివాదానికి తెరలేపడం దారుణం అన్నారు.

నిర్దిష్టంగా కొందరు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు అక్టోబర్ 6వ తేదీన లేఖ రాశారు. దానిని… 8వ తేదీన అందించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత రెండు రోజుల్లోనే ఆకస్మికంగా మీడియా ముందుకు వచ్చి ‘హైడ్రామా’ సృష్టించారు. సీజేకు ఇచ్చిన ఫిర్యాదుతోపాటు పలురకాల పత్రాలు బహిర్గతం చేశారు. జడ్జిల పేర్లు ప్రస్తావిస్తూ ఆరోపణలు చేశారు. నిజంగా న్యాయ వ్యవస్థపైన, సుప్రీంకోర్టుపైన గౌరవం ఉంటే… తమ ఫిర్యాదుపై చీఫ్‌ జస్టిస్‌ స్పందన కోసం వేచి చూసేవారని, ఫిర్యాదు పత్రాలు బహిర్గతం చేసే వారు కాదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.

Next Story

Most Viewed