ఏపీ vs తెలంగాణ.. కేంద్రానికి ఎంపీ రఘురామ లేఖ

by  |
MP Raghu Ramakrishnam Raju
X

దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాన్ని పరిష్కరించాలని కోరారు. ఇద్దరు శత్రువుల మధ్య వివాదాన్ని ఈజీ పరిష్కరించవచ్చునని కానీ రెండు రాష్ట్రాల సీఎంలు మంచి మిత్రులని చెప్పుకొచ్చారు. ఇద్దరి మధ్య వివాదాన్ని పరిష్కరించడం అంత సులభం కాదన్నారు. కేంద్రం జోక్యం చేసుకోకపోతే వివాదం ముదిరి శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. శ్రీశైలం డ్యామ్, విద్యుత్ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. నీరు, విద్యుత్ పంపిణీ బాధ్యతలు కేంద్రం తీసుకోవాలని ఎంపీ రఘురామ కోరారు.



Next Story

Most Viewed