గిట్టుబాటు ధర కల్పించండి : ఎంపీ పసునూరి, ఎమ్మెల్యే రాజయ్య

by  |
MP Pasunuri Dayakar
X

దిశ, స్టేషన్ ఘన్‌పూర్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి, మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని వ్యాపారస్తులకు ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే రాజయ్య సూచించారు. సోమవారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు, వైస్ చైర్మన్ చంద్రారెడ్డి, పాలకమండలి ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ దయాకర్, ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. జిల్లాలో రెండో అతిపెద్ద మార్కెట్‌గా పేరున్న ఈ మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వర శర్మ, నూతన పాలక మండలి సభ్యులను ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో జనగామ మార్కెట్ చైర్మన్ విజయ, వైస్ చైర్మన్ చంద్రారెడ్డి, మార్కెట్ కార్యదర్శి జీవన్ కుమార్, డైరెక్టర్లు, మూడు మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed