90శాతం హామీలు నెరవేర్చిన జగన్ : మోపిదేవి

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ఫైర్ అయ్యారు. వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని సీబీఎన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. బాబు దిగజారుడు తనానికి ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ 90శాతం నేరవేర్చారని చెప్పారు. 36 లక్షలమంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే ప్రతిపక్ష పార్టీ అడ్డుంకులు సృష్టిస్తోందని మోపిదేవి వివరించారు. జగన్ పాలనలో అందరూ సంతోషంగా [&hellip;]</p>

90శాతం హామీలు నెరవేర్చిన జగన్ : మోపిదేవి
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ఫైర్ అయ్యారు. వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని సీబీఎన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. బాబు దిగజారుడు తనానికి ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ 90శాతం నేరవేర్చారని చెప్పారు.

36 లక్షలమంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే ప్రతిపక్ష పార్టీ అడ్డుంకులు సృష్టిస్తోందని మోపిదేవి వివరించారు. జగన్ పాలనలో అందరూ సంతోషంగా ఉన్నారని.. దీంతో బీసీలు, మైనార్టీలు ఎక్కడ టీడీపీకి దూరమవుతారోనని బాబుకు భయం పట్టుకుందని ఆయన దుయ్యబట్టారు.

Next Story