కేసీఆర్, కేటీఆర్‌ను కడిగేసిన కోమటిరెడ్డి

by  |
కేసీఆర్, కేటీఆర్‌ను కడిగేసిన కోమటిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా స్పందస్తూ… ‘ఒక వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వరదలెత్తి.. నాళాలు ప్రజల ప్రాణాలు మింగేస్తుంటే.. మరో వైపు జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం తండ్రి & కొడుకు వీర లెవల్లో కసరత్తు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలపై లేని ప్రేమను గ్రేటర్ ఎన్నికలపై మాత్రం తెగ చూపిస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా..?’ అని వెల్లడించారు.

అంతేగాకుండా ‘సరూర్ నగర్‌లో సరోజ అనే వృద్ధురాలు డ్రైయిన్‌లో పడి కొట్టుకుపోయి.. చైతన్యపురిలో శవమై తేలింది.. మీ నిర్లక్ష్యానికి ఇది నిలువెత్తు సాక్ష్యం కాదా..? మీ పాలన వైఫల్యానికి ఇది ప్రతిబింబం కాదా..?’ అని ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై కోమటిరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.

Next Story