Komatireddy Venkat Reddy: మానవత్వం చాటుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

by  |
Komatireddy Venkat Reddy: మానవత్వం చాటుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
X

దిశ, మోత్కూరు: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మానవత్వం చాటుకున్నారు. ఉమ్మడి ఆత్మకూర్(ఎం) మండలం కదిరెనిగూడెం గ్రామానికి చెందిన నలమాస అశోక్(32) అనే గీత కార్మికుడు తాటి చెట్టు నుండి పడి తీవ్రంగా గాయపడ్డాడు. గత 15 రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. అతని భార్య కూడా గత ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మరణించడంతో.. వారికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చలించిపోయి, మానవత్వంతో స్పందించి తక్షణ సహాయంగా లక్ష రూపాయలు అశోక్ కుటుంబానికి అందజేశారు.

Next Story