ఐసోలేషన్ వార్డులు నగరాల్లో వద్దు

by Vemula.Srinu Prasad |

<p>ఏపీలో కరోనా బాధితుల ఐసోలేషన్ వార్డులను నగరాలకు దూరంగా పెట్టాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేశారు. ఐసోలేషన్ కేంద్రాలను నగరాల్లోనే ఏర్పాటు చేయడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. &#8220;దయచేసి ప్రజల ప్రాణాలతో ఆటలొద్దు. కరోనా ఐసోలేషన్ వార్డులను నగరానికి దూరంగా పెట్టండి&#8221; అంటూ ఆయన కృష్ణా జిల్లా కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ లను కోరారు. అంతకుముందు &#8220;విజయవాడ నడిబొడ్డున ఉన్న కొత్త ప్రభుత్వ ఆసుపత్రిని [&hellip;]</p>

ఐసోలేషన్ వార్డులు నగరాల్లో వద్దు
X

ఏపీలో కరోనా బాధితుల ఐసోలేషన్ వార్డులను నగరాలకు దూరంగా పెట్టాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేశారు. ఐసోలేషన్ కేంద్రాలను నగరాల్లోనే ఏర్పాటు చేయడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

“దయచేసి ప్రజల ప్రాణాలతో ఆటలొద్దు. కరోనా ఐసోలేషన్ వార్డులను నగరానికి దూరంగా పెట్టండి” అంటూ ఆయన కృష్ణా జిల్లా కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ లను కోరారు. అంతకుముందు “విజయవాడ నడిబొడ్డున ఉన్న కొత్త ప్రభుత్వ ఆసుపత్రిని 6 జిల్లాలకు చెందిన కరోనా బాధితుల ఐసోలేషన్ వార్డులుగా మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఇది మంచి నిర్ణయం కాదని, జనావాసాల మధ్యలో ఐసోలేషన్ వార్డులు పెట్టటం ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదు.” అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు విజ్ఞప్తి చేశారు.

Tags: tdp mp kesineni nani, carona, isolation wards

Next Story