కేంద్రానికి వందల లేఖలు రాశాం : కేకే

by  |
కేంద్రానికి వందల లేఖలు రాశాం : కేకే
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో పోరాటం చేస్తామని రాజ్యసభ ఎంపీ కే.కేశవరావు అన్నారు. ఇప్పటికే తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై వందల కొద్ది లేఖలు రాసినా కేంద్రం నుంచి స్పందన కరువైందన్నారు. నీటి పంపకాల విషయంలో రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ఏదేళ్లుగా పోరాటం చేస్తున్నామని.. రైతులకు రావాల్సిన యూరియా విషయంలోనూ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వివరించారు.

కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన విద్యుత్ బిల్లుతో రాష్ట్రాలకు ఎలాంటి ప్రయోజనం లేదని కేకే విమర్శించారు. పార్లమెంటులో ఈ బిల్లును తప్పకుండా వ్యతిరేకిస్తామని చెప్పారు. జాతీయ రహదారుల విషయంలోనూ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని, కేంద్రం నుంచి మొత్తం రూ.8,755 కోట్లు రాష్ట్రానికి రావాలని తెలిపారు.

Read Also..

మూడే గంటల్లో అసెంబ్లీ ఓవర్..


Next Story