నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు

by  |
నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు
X

దిశ, ఏపీబ్యూరో : నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఎంపీ జీవీఎల్​నరసింహారావు తెలిపారు. గుంటూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండించే మిర్చిని థాయిలాండ్, మలేషియా, చైనా, సింగపూర్ దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా రైతులకు మరింత లాభం చేకూరుతుందని చెప్పారు.

ఎగుమతులు పెంచే విషయంపై కసరత్తు చేస్తున్నామన్నారు. పెట్టుబడి తగ్గించి ఆదాయం పెంచే విషయంపై చర్చలు జరుగుతున్నాయని జీవీఎల్​తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలతో మిర్చి లాంటి వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర వస్తుందని జీవీఎల్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed