ఎంపీ జీవీఎల్ చైర్మన్​గా ప్రత్యేక టాస్క్​ఫోర్స్​

by  |
ఎంపీ జీవీఎల్ చైర్మన్​గా ప్రత్యేక టాస్క్​ఫోర్స్​
X

దిశ, ఏపీ బ్యూరో: మిర్చి పంట అభివృద్ధి, ఎగుమతుల ప్రోత్సాహం కోసం ఎంపీ జీవీఎల్ నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం స్పైసెస్​ బోర్డుకు ఉత్తర్వులు జారీ చేసింది. మిర్చి సాగు, ఎగుమతులకు ఎదురవుతున్న సమస్యలు, అవకాశాల గురించి తగు విధానాలను రూపొందించడానికి ఈ టాస్క్‌ఫోర్స్ క్షుణ్ణంగా అధ్యయనం చేయనుంది. 15మంది సభ్యుల ఈ కమిటీ ఆరు నెలల వ్యవధిలో తన నివేదికను పూర్తి చేస్తుంది. ఇతరత్రా అవసరాలను బట్టి అదనంగా సభ్యులను చేర్చుకునే అధికారాలు కూడా చైర్మన్​కు ఉంటాయి. కమిటీలో కేంద్ర, రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు, శాస్ర్తవేత్తలు, రాష్ట్రాలకు చెందిన రైతుసంఘాల నాయకులు, ఎగుమతి దారులు సభ్యులుగా ఉంటారు.


Next Story