ఎంపీకి కరోనా పాజిటివ్

by  |
ఎంపీకి కరోనా పాజిటివ్
X

దిశ, జుక్కల్ :
జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తాను ఈ మధ్యనే కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. గత వారం రోజుల నుండి తనతో సెకండరీ కాంటాక్ట్ అయినవాళ్లు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలన్నారు. లక్షణాలు ఉన్న వాళ్లు కోవిడ్ పరీక్ష చేయించుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనీ, వైద్యుల సలహాలు సూచనల మేరకు మందులు వాడుతున్నానని తెలిపారు.

Next Story