నారింజ ప్రాజెక్టులో పూడికతీత

by  |
నారింజ ప్రాజెక్టులో పూడికతీత
X

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు గ్రామంలో ఉన్న నారింజ ప్రాజెక్టు పూడికతీత పనులను ఎంపీ బి.బి.పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారింజ ప్రాజెక్టు గేట్ల మరమ్మత్తులతో పాటు పూడికతీత పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. రైతులకు ఉచితంగా పూడికతీత మట్టిని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మనిక్ రావు, ఎమ్మెల్సీ ఫరిదొడ్డిన్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, సంగారెడ్డి కలెక్టర్ హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.



Next Story