ఉత్సవాలు జరపడం దేశ ద్రోహమా: బండి సంజయ్

by Shyam |

<p>దిశ,వెబ్‌డెస్క్: జనగామ బీజేపీ అధ్యక్షుడు పవన్ శర్మపై లాఠీ చార్జ్ అమానుషమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. జనగామ లాఠీచార్జ్ ఘటనపై ఆయన మంగళవారం స్పందించారు. పోలీసులు అధికార పార్టీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. సీఐ మల్లేష్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వామి వివేకానంద ఉత్సవాలు జరపడం దేశ ద్రోహమా అని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై ఆందోళనలు చేస్తామని వెల్లడించారు.</p>

ఉత్సవాలు జరపడం దేశ ద్రోహమా: బండి సంజయ్
X

దిశ,వెబ్‌డెస్క్: జనగామ బీజేపీ అధ్యక్షుడు పవన్ శర్మపై లాఠీ చార్జ్ అమానుషమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. జనగామ లాఠీచార్జ్ ఘటనపై ఆయన మంగళవారం స్పందించారు. పోలీసులు అధికార పార్టీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. సీఐ మల్లేష్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వామి వివేకానంద ఉత్సవాలు జరపడం దేశ ద్రోహమా అని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై ఆందోళనలు చేస్తామని వెల్లడించారు.

Next Story