రైతులతో స్పైస్ బోర్డు ప్రతినిధుల సమావేశం…

by  |
రైతులతో స్పైస్ బోర్డు ప్రతినిధుల సమావేశం…
X

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్పైస్ బోర్డు రీజినల్ ఎక్సటెన్సెన్ సెంటర్ ఏర్పాటు తరువాత అధికారులు సమావేశం నిర్వహించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు హోటల్లో రైతులు, విక్రయదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ డుమ్మా కొట్టారు. కేంద్రం స్పైస్ బోర్డు మెంబెర్ విక్రమ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులు పసుపునకు గిట్టుబాటు ధరఫై బోర్డు అధికారులకు మొర పెట్టుకున్నారు. జిల్లా కేంద్రంలో ఈనాం ద్వారా విక్రయాలు చేసిన వ్యాపారులు సిండికేట్ అయి మంచి ధర దక్కనీయడం లేదని ఆరోపించారు. బోర్డు ద్వారా నేరుగా కొనుగోలు, మంచి ధర ఉండలని కోరారు. ఈ సమావేశం లో రైతులు, వ్యాపారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed