పాన్ ఇండియా మూవీతో యూట్యూబర్ హర్ష సాయి హీరోగా ఎంట్రీ.. డబుల్ అప్డేట్స్

by Disha Web Desk 6 |
పాన్ ఇండియా మూవీతో యూట్యూబర్ హర్ష సాయి హీరోగా ఎంట్రీ.. డబుల్ అప్డేట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యూట్యూబర్ హర్షసాయికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఛానల్స్ ఓపెన్ చేసి లక్షలు సంపాదిస్తున్నాడు. అలా వచ్చిన డబ్బులను కష్టాల్లో ఉన్నవారికి అందించి పేద ప్రజలను ఆదుకుంటున్నాడు. అలాగే గుడిసెల ముందు గుమ్మరించడం, తలదాచుకోవడానికి నీడ లేని వారికి ఇల్లు, పిల్లాడికో సైకిల్ స్కూల్ ఫీజులు ఇలా ఎన్నో మంచి పనులు చేస్తూనే మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు.

తాజాగా, హర్ష సాయి పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. దీనిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దగ్గరి బంధువైన కల్వకుంట్ల వంశీధర్ రావు ఈ సినిమాని సమర్పిస్తున్నారు. అలాగే బిగ్‌బాస్ బ్యూటీ మిత్రావ్ శర్మ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఆమె సొంత బ్యానర్ అయిన శ్రీ పిక్చర్స్‌పై ఇది తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సంబంధించిన డబుల్ అప్డేట్స్ వచ్చాయి. సెప్టెంబర్ 17న ఉదయం 10 గంటలకు ఈ మూవీ టైటిల్, టీజర్ విడుదల చేయబోతున్నట్లు మిత్రావ్ శర్మ తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇది హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్నట్లు సమాచారం.

Read More: Pragya Jaiswal : టాప్ ఓపెన్ చేసి పరువాలతో కవ్విస్తున్న ప్రగ్యా జైస్వాల్



Next Story

Most Viewed