Keerthy Suresh : మాది ఏడేళ్ల బంధం.. కీర్తి సురేష్ వైరల్ పోస్ట్

by Dishafeatures1 |
Keerthy Suresh : మాది ఏడేళ్ల బంధం.. కీర్తి సురేష్ వైరల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ అన్ స్క్రీన్ టాప్ జంటలో నాని- కీర్తి సురేష్ ఒకరు. ఈ ఇద్దరు ఆన్ స్క్రీన్‌ కంటే.. ఆఫ్ స్క్రీన్‌లోనే ఎక్కువగా అందరినీ ఆకట్టుకుంటుంది. ‘దసరా’ మూవీ ప్రమోషన్స్‌లో వీరిద్దరు కలిసి ఎంత అల్లరి చేశారో అందరికీ తెలిసిందే. ఇక సెట్స్‌లోనూ ఈ ఇద్దరూ బాగానే సందడి చేస్తారు, షాట్స్‌కి గ్యాప్ వస్తే ఆటలు ఆడుకున్నారు. ఆ వీడియోలు సైతం నెట్టింట్లో బాగానే వైరల్ అయ్యాయి. ‘నేను లోకల్’ సినిమా నుండి నాని, కీర్తి సురేష్‌ల మధ్య క్లోజ్‌నెస్ పెరిగింది. అయితే ఈ ‘నేను లోకల్’ సినిమా విడుదలై నేటితో ఏడేళ్లు అవుతుందట. ఈ మేరకు తాజాగా కీర్తి సురేష్ పోస్ట్.. దాని మీద నాని రియాక్షన్ వైరల్ అవుతోంది. ముందుగా కీర్తి ‘మనం కలిసి ఏడేళ్లకు పైగా అవుతుంది రా... ఈ ఏడేళ్లు అలా చిటికెలో గడిచినట్టుగా అనిపిస్తుంది.. ఇంకా మనం కలిసి ఎన్నో సినిమాలు చేయాలి’ అంటూ నాని గురించి కామెంట్ చేసింది. దీంతో నాని ‘ నిన్ను ఇంకా ఇంకా డిస్టర్బ్ చేస్తూనే ఉంటా’ అంటూ నాని కౌంటర్లు వేశాడు. ఇక ఈ ఇద్దరి ఫన్నీ ముచ్చట్లు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Next Story

Most Viewed