కేసులు వెయ్యడం మాకూడా తెలుసు ఇక పూర్తిగా రంగంలోకి దిగుతా.. అనసూయకు వార్నింగ్ ఇచ్చిన నటి

by Mallepaka Hamsa |

ప్రస్తుతం ఎక్కడ చూసినా శివాజీ (Shivaji)వివాదానికి సంబంధించిన వార్తలే మార్మోగిపోతున్నాయి.

కేసులు వెయ్యడం మాకూడా తెలుసు ఇక పూర్తిగా రంగంలోకి దిగుతా.. అనసూయకు వార్నింగ్ ఇచ్చిన నటి
X

దిశ, సినిమా: ప్రస్తుతం ఎక్కడ చూసినా శివాజీ (Shivaji)వివాదానికి సంబంధించిన వార్తలే మార్మోగిపోతున్నాయి. ‘దండోరా’ ఈవెంట్‌లో ఆయన హీరోయిన్ల సామాన్లపై చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద చర్చకు దారితీశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనసూయ(Anasuya), చిన్మయి, పాయల్, వంటి వారు శివాజీని తప్పుపడుతూ పలు సంచలన పోస్టులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో మొత్తం శివాజీ పేరే కనిపిస్తోంది. ఇక ఆయన వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోయింది. కొందరు శివాజీ చెప్పింది నిజమని అంటుంటే.. మరికొందరు మాత్రం ఆయన కామెంట్స్‌ను తప్పుపడుతున్నారు. వ్యతిరేకంగా పలు పోస్టులు పెడుతున్నారు. ఇక టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి మాత్రం శివాజీకి సపోర్ట్‌గా నిలుస్తూ.. చిన్మయి, అనసూయ వంటి వారికి కౌంటర్లు వేస్తోంది.

ఈక్రమంలోనే శివాజీ హీరోయిన్లకు క్షమాపణలు చెప్పినప్పటికీ ఈ వివాదానికి చెక్ పడటం లేదు. శివాజీ, అనసూయ, కరాటే కళ్యాణి(Karate Kalyani)ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, కరాటే కళ్యాణి సంచలన పోస్ట్ పెట్టింది. ‘‘బట్టలు సరిగ్గా వేసుకోమని చెప్పడం కూడా తప్పేనా? వ్యక్తిగత స్వేచ్ఛకు నేను వ్యతిరేకం కాదు. కానీ హీరోయిన్లు పబ్లిక్ ఫంక్షన్లకు వచ్చినప్పుడు కొంత హద్దు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పింది. అనసూయను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. రేపు వారు అసభ్యకరమైన దుస్తులు ధరించే అమ్మాయిలతో తిరిగితే ఇష్టమేనా?ఈ రోజుల్లో మంచిగా పద్ధతిగా ఉండమని చెప్తే లీగల్ నోటీసులు.. కనసూయ.. నీకే కాదు మాకు తెలుసమ్మా కేసులు వెయ్యడం.. కెలికావ్ ఇక పూర్తిగా రంగంలోకి దిగుతా’’ అని వార్నింగ్ ఇచ్చింది. దీన్ని బట్టి చూస్తుంటే అనసూయ కరాటే కళ్యాణి, శివాజీలపై కేసు పెట్టి నోటీసులు పంపినట్లు అర్థమవుతోంది.

Next Story