Venkatesh, Aishwarya Rai మధ్య ఇంత పెద్ద గొడవ జరిగిందా?

by Disha Web Desk 10 |
Venkatesh, Aishwarya Rai మధ్య ఇంత పెద్ద గొడవ జరిగిందా?
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినీ ఇండస్ట్రీలో అందరితో కలిసిపోయే హీరోలలో ఒకరు విక్టరీ వెంకటేష్. లెజండరీ నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. హీరోయిన్స్ పట్ల కూడా ఆయన వ్యవహరించుకునే తీరు ఎంతో ప్రశంసనీయం. ఇలా ఉండే వెంకటేష్ కి కూడా కోపం తెప్పించిన హీరోయిన్ ఒకరు ఉన్నారట. ఆమె ఎవరో కాదు.. ఐశ్వర్య రాయ్ అట. ఈ అందాల భామ ఇప్పటి వరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. నాగార్జున హీరో గా నటించిన 'రావోయి చందమామ' సినిమాలో ఒక పాటలో కనిపించింది అంతే.

విక్టరీ వెంకటేష్, ప్రీతీ జింటా జంటగా కలిసి నటించిన సినిమా 'ప్రేమంటే ఇదేరా'. ఈ సినిమా అప్పటిలో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ప్రీతీ జింటా కన్నా ముందుగా ఐశ్వర్య రాయ్ ని సంప్రదించారట. కానీ ఈ భామ డేట్స్ ఇవ్వడానికి దర్శక నిర్మాతలను చాలా ఇబ్బంది పెట్టిందట. కాసేపు డేట్స్ ఇస్తానని చెప్పి, ఇంకాసేపు ఈ డేట్స్ లో అయితేనే నేను షూటింగ్ కి వస్తానని చెప్పిందట. అంతే కాకుండా అడ్వాన్స్ ఇస్తేనే డేట్స్ ఇస్తానని చెప్పి కొన్ని కండిషన్స్ పెట్టిందట. ఇదంతా తెలుసుకున్న వెంకటేష్, ఐశ్వర్య రాయ్ కి కాల్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు అప్పట్లో ఇండస్ట్రీ లో రూమర్స్ వచ్చాయి.

Also Read: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఇవే..


Next Story

Most Viewed