విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ ఓవర్సీస్ రైట్స్‌ను సొంతం చేసుకున్న రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ ‘ఫలక్ నామా దాస్’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పాగల్, ఓరి దేవుడా చిత్రాలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు.

విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ ఓవర్సీస్ రైట్స్‌ను సొంతం చేసుకున్న రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ ‘ఫలక్ నామా దాస్’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పాగల్, ఓరి దేవుడా చిత్రాలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజాగా, విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ సినిమాతో ఫ్యాన్స్‌ను అలరించడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీని ఫిబ్రవరి 17న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల సినిమా వాయిదా వేశారు. తాజాగా, ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్‌ను ప్రముఖ సంస్థ ‘రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్’ సొంతం చేసుకుంది. ఆ విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్ వేదికగా మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.

అయితే ‘ధమ్కీ’ సినిమాను మార్చి 22న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో విశ్వక్ సరసన నివేదా పేతురాజ్ నటిస్తుంది. ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేశాయి. అయితే ఫిబ్రవరి 18న ప్రీరిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించడానికి మేకర్స్ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను గెస్ట్‌గా పిలిచే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story