స్పై థ్రిల్లర్ గా విక్రమ్ 'ధృవ నచ్చతిరమ్'

by Disha Web Desk 1 |

దిశ, వెబ్ డెస్క్: గౌతమ్ మీనన్‌ దర్శకత్వంలో స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఓ సినిమా చేస్తున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాకి 'ధృవ నచ్చతిరమ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేశారు. ఈ సినిమాలో విక్రమ్ సరసన రీతూ వర్మ నటించనుంది. తాజాగా, విక్రమ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆ చిత్ర యూనిట్ చియాన్ విక్రమ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

స్పై థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో జాతీయ భద్రతా ఏజెన్సీ కోసం పనిచేసే పది మంది రహస్య ఏజెంట్లస్ లో విక్రమ్ టీం హెడ్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, పార్తీబన్, సిమ్రాన్, రాధిక, దివ్య దర్శిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఒండ్రాగా ఎంటర్‌టైన్‌మెంట్, కొండడువోం ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధృవ నచ్చతిరమ్‌కి హారిస్ జయరాజ్ బాణీలు అందించారు.


Next Story