‘జైలర్’లోని ఆ పాట నయనతార కోసం రాసిందా?

by Disha Web Desk 10 |
‘జైలర్’లోని ఆ పాట నయనతార కోసం రాసిందా?
X

దిశ, సినిమా : లేడీ సూపర్ స్టార్ నయనతార.. క్రేజీ డైరెక్టర్ విఘ్రేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలను కన్న వీరు.. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే తమిళనాడులో తలైవా రజనీకాంత్ ‘జైలర్’ సినిమాకు సూపర్ డూపర్ క్రేజ్ రాగా ఆమెతో రొమాంటిక్ ఫొటో షేర్ చేస్తూ.. అందులోని పాటను డెడికేట్ చేశాడు. ఈ చిత్రంలోని ‘రథమారే’ పాటను శివన్ రాయగా.. రెస్పాన్స్ అదిరిపోయింది. అందుకే తన కన్నమ్మకు ఈ పాటను అంకితమిస్తున్నానని పోస్ట్ పెట్టాడు. తలైవాకు పాట రాయడం ఇదే తొలిసారి కాగా ఈ పాటనే తన పిల్లలు, ఫ్యామిలీకి రాసిన తొలిపాట అయినట్లుందని క్యాప్షన్ ఇచ్చాడు. ఫాదర్ అండ్ సన్ రిలేషన్‌షిప్ గురించి రాసిన ఈ సాంగ్ ప్రేక్షకుల మనసును హత్తుకుంటోంది.

Read More: రజనీకాంత్ ఎనర్జీ సీక్రెట్ ఇదే.. హిమాలయాల్లో దొరికే అవి తినడం వల్లే..

Next Story

Most Viewed