అంబానీ ఇంట్లో జాన్వీ కపూర్ అలాంటి పనులు.. డబ్బు కోసం ఏమైనా చేస్తావా అంటూ దారుణ ట్రోల్స్

by Disha Web Desk 6 |
అంబానీ ఇంట్లో జాన్వీ కపూర్ అలాంటి పనులు.. డబ్బు కోసం ఏమైనా చేస్తావా అంటూ దారుణ ట్రోల్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ దేవర మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టనుంది. అలాగే పలు ఆఫర్లు కూడా పట్టేసినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ అమ్మడు నిత్యం సోషల్ మీడియాలో ఉండి పలు హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా, జాన్వీ కపూర్ చేసిన ఓ పని వల్ల ట్రోల్స్‌కు గురైంది.

అసలు విషయంలోకి వెళితే.. అపర కుబేరుడు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సంబరాలు దాదాపు మూడు రోజుల పాటు గుజరాత్‌లోని జూమ్ నగర్‌లో జరిగాయి. ఈ ఈవెంట్‌కు ప్రపంచ నలుమూలల నుంచి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ ఫ్యామిలీతో పాటు వెళ్లింది.

అక్కడ రాధిక మర్చంట్ పెళ్లి కూతురిగా ముస్తాబై నడుస్తూ ఉండగా పక్కనే కొందరు ఆమెపై పువ్వులు చల్లుతూ హారతులు పట్టారు. అందులో జాన్వీ కపూర్ కూడా ఏకంగా పళ్లెం పట్టుకొని మరీ హారతి ఇస్తూ కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా అది చూసిన నెటిజన్లు దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. డబ్బు కోసం ఎలాంటి పనులు అయినా చేస్తావా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం అందులో తప్పేముందని ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Read More..

అభిమానికి అదిరిపోయే రిప్లై ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా..




Next Story

Most Viewed