ఆలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తున్న వరుణ్-లావణ్య.. కారణం అదేనా?

by Disha Web Desk 6 |
ఆలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తున్న వరుణ్-లావణ్య.. కారణం అదేనా?
X

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి దంపతులు పెళ్లయిన దగ్గర నుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఫుల్ బిజీ అయిపోయారు. మెగా కోడలు ఇటీవల నటించిన మిస్‌ఫర్‌ఫెక్ట్ వెబ్ సిరీస్ విడుదలై మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇక వరుణ్ పాన్ ఇండియా సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ తో మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ దర్శకత్వం వహించగా.. మానుషీ చిల్లర్ హీరోయిన్‌గా నటిస్తుంది.

అయితే ఆపరేషన్ వాలెంటైన్ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ భారీ అంచనాలు పెంచాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటంతో వరుణ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా, మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట గోదావరి తల్లిని దర్శించుకున్నారు. అంతేకాకుండా అక్కడ భార్యతో కలిసి ప్రత్యేక పూజ చేయింనట్లు సమాచారం. ఈ విషయాన్ని వరుణ్ తన ఇన్‌స్టా వేదికగా తెలిపాడు.

గోదావరి తల్లి దీవెనలు తీసుకున్నాము అని పూజ చేస్తున్న కొందరు పూజారుల ఫొటోలతో పాటు తాను అందులో భాగమైనట్లు తెలిపాడు. భార్య ఫొటో మాత్రం పెట్టలేదు. కానీ లావణ్య కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో గోదావరిలోని పడవ ఫొటో షేర్ చేయడంతో ఇద్దరు కలిసే వెళ్లినట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం వరుణ్ పోస్ట్ వైరల్ అవుతుండగా ఆపరేషన్ వాలెంటైన్ హిట్ అందుకోవడానికి ఈ పూజలు చేయించారా? లేక మరేదైనా కారణం ఉందా? అని నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.




Next Story

Most Viewed