ఇది క్రూరమైన చర్య.. అభిమాని ప్లకార్డుపై ఊర్వశి సీరియస్

by Disha Web Desk 10 |
ఇది క్రూరమైన చర్య.. అభిమాని ప్లకార్డుపై ఊర్వశి సీరియస్
X

దిశ, సినిమా : IPL 2023లో భాగంగా ఇటీవల ఢిల్లీ-గుజరాత్ టైటాన్స్ మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తన ప్రస్తావన రావడంపై నటి ఊర్వశి రౌతేలా స్పందించింది. ఈ మేరకు కారు యాక్సిండెంట్ వల్ల టోర్నమెంట్‌కు దూరమైన ఢిల్లీ ప్లేయర్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్ తిలకించడానికి వచ్చాడు. ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని.. ‘థాంక్ గాడ్ ఊర్వశి ఇక్కడ లేదు’ అనే ప్లకార్డ్‌తో దర్శనమిచ్చింది. అయితే ఆ ఫొటో నెట్టింట తెగ వైరల్ కావడంతో షాక్ అయిన ఊర్వశి.. ఆ ప్లకార్డు తనకు వ్యతిరేకంగా ఉందంటూ సీరియస్ అయింది. ‘రిషబ్‌తో సమస్యాత్మక సంబంధాన్ని సూచించే ప్లకార్డ్‌ను పట్టుకుని ఉన్న మహిళను నేను చూశాను. ఎందుకిలా చేశారు. నా వ్యక్తిగత హక్కుకు భంగం కలిగించారు. ఇది క్రూరమైన చర్య’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట పోస్ట్ చేసింది.

Next Story